ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారు భరణానికి అనర్హులు..: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు

national |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 07:32 PM

సాధారణంగా దంపతులు విడాకులు తీసుకున్నప్పుడు భార్యకు భర్త చేత భరణం ఇప్పించడం చాలా కాలంగా వస్తూనే ఉంది. నెలనెలా లేదా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులో, ఆస్తులో ఇప్పిస్తుంటారు. ఇదంతా మనకు తెలిసిందే. కానీ తాజాగా వివాహేతర సంబంధం కొనసాగించే భార్యలకు, అదే కారణంతో విడాకులు తీసుకున్న ఎవరికి కూడా భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇలాంటి మహిళలు భరణానికి అనర్హులని పేర్కొంది. ముఖ్యంగా భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుసుకుని విడాకులు ఇచ్చిన భర్త చేత కూడా భరణం ఇప్పించగా.. మరింత పెంచాలంటూ ఆమె మళ్లీ అప్పీలు చేసుకుంది. దీంతో భర్త హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది.


రాయ్‌పూర్‌కు చెందిన ఓ జంటకు 2019లో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. అయితే రెండేళ్లు బాగానే ఉండగా.. 2021లో మాత్రం ఆమె విడాకులకు ధరఖాస్తు చేసుకుంది. ముఖ్యంగా రాయ్‌పూర్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్లి తన భర్త తనను శారీరకంగా, మానసికంగా వేదిస్తున్నాడని.. విడాకులు ఇవ్వడంతో పాటు తనకు భరణం కూడా ఇప్పించాలని కోరింది. అయితే భర్త మాత్రం.. భార్య తన తమ్ముడితోనే వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ఇదేంటని ప్రశ్నిస్తే తప్పుడు కేసు పెడతానంటూ బెదిరించిందని.. ఆమె నుంచి తనకు కూడా విడాకులు కావాలంటూ భర్త కేసు పెట్టాడు.


  ఇలా 2023 సెప్టెంబర్ 8వ తేదీన విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగానే ఆమెకు నెలకు రూ.4 వేల భరణం కింద చెల్లించాలంటూ నవంబర్ 6వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆ భరణాన్ని 20 వేలకు పెంచాలంటూ ఆమె మరో పిటిషన్ దాఖలు చేయగా.. దీన్ని సవాల్ చేస్తూ ఆమె భర్త హైకోర్టును ఆశ్రయించాడు. అయితే తాజాగా విచారణ జరిపిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125(5) ప్రకారం వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళకు భరణం పొందే హక్కు లేదని జస్టిస్ అరవింద్ కుమార్ వర్మ మే 9వ తేదీన ఇచ్చిన తీర్పులో వెల్లడించారు.


ముఖ్యంగా వివాహేతర సంబంధం కారణాలతో విడాకులు పొందిన మహిళ భరణాన్ని పొందేందుకు అనర్హురాలని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు వెల్లడించింది. ఆ మహిళకు రూ.4 వేల భరణం చెల్లించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును, తన భరణాన్ని రూ.20 వేలకు పెంచాలంటూ భార్య చేసిన విజ్ఞప్తిని హైకోర్టు కొట్టివేసింది. ఈ షాకింగ్ తీర్పుతో ప్రజలంతా ఆశ్చర్య పోతున్నారు ఇలాంటి తీర్పుల వల్ల.. భర్తలను మోసం చేసిన భార్యలకు సరైన శిక్ష పడుతుందని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa