ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ.. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మరో ఎదురుదెబ్బ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 02:19 PM

గన్నవరం వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి కోర్టులో నిరాశ తప్పలేదు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్‌ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను నూజివీడు కోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసులో అరెస్టైన వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. 
సోమవారం ఉదయం వంశీ అస్వస్థతకు గురవడంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బెయిల్‌ పిటిషన్‌పై న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేస్తూ, బెయిల్‌ను కొట్టివేశారు. 
వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, కిడ్నాప్‌, అక్రమ మైనింగ్‌, భూ కబ్జా వంటి బహుళ ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన రిమాండ్‌లో ఉంటూ, బెయిల్‌ కోసం పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, కోర్టు నుంచి ఊరట లభించడం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa