ఐపీఎల్ సీజన్ ఆరంభం, ముగింపులో ఎక్కువ ఆసక్తి నెలకొల్పే ప్రశ్న ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్. ఇంటర్నేషనల్ క్రికెట్కు 2019లోనే గుడ్ బై పలికిన మిస్టర్ కూల్.. ఫ్యాన్స్ కోసం ఐపీఎల్ ఆడుతూనే ఉన్నాడు. ఇదే లాస్ట్ ఇయర్ అని అనుకున్న ప్రతిసారీ మళ్లీ తిరగొచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా రిటైర్మెంట్ విషయంలో ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను చెన్నై సూపర్ కింగ్స్ చిత్తు చిత్తు చేసింది. ఈ సీజన్లోనే సీఎస్కే బెస్ట్ స్కోర్ చేయడంతో పాటు గుజరాత్ను కూడా మట్టికరిపించి విక్టరీతో ఐపీఎల్ 2025కి వీడ్కోలు పలికింది.
మ్యాచ్ అనంతరం హర్ష భోగ్లే రిటైర్మెంట్ గురించి ప్రస్తావించిన సమయంలో ఎంఎస్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పలేను, అదేవిధంగా వచ్చే ఏడాది మళ్లీ తిరిగి వస్తానని చెప్పడం లేదంటూ ధోనీ అందర్నీ కన్ఫ్యూజ్ చేశాడు. ఏ విషయం అనేది మరో నాలుగైదు నెలల్లో తెలుస్తుంది అంటూ ప్రస్తుతానికి రిటైర్మెంట్ న్యూస్ని పాజ్ చేశాడు.
"రిటైర్మెంట్ అనేది ఇప్పుడే తీసుకోవాలని లేదు. మరో నాలుగైదు నెలలు ఆలోచించుకుని చెప్తాను. హడావుడిగా నిర్ణయం తీసుకోవాలని అనుకోవడం లేదు. ప్రతి సంవత్సరం 15 శాతం ఎక్కువ ఎఫెర్ట్స్ పెడుతూనే ఉన్నాను. క్రికెట్లో పర్ఫార్మెన్స్నే చూసుకోకూడదు. అలా చూస్తే ప్రతి ఒక్కరూ 22 సంవత్సరాలకే రిటైర్ అవ్వాల్సి వస్తుంది. జట్టుకు మన అవసరం ఎంత వరకు ఉంది, జట్టు విజయాల్లో మన పాత్ర ఏంటి అనేదే ముఖ్యం. అందువల్ల నేనైతే ఇప్పుడల్లా రిటైర్మెంట్ విషయం ఆలోచించాలని అనుకోవడం లేదు. రాంచీ వెళ్లి కొన్ని రోజులు ఎంజాయ్ చేసి, బైక్ రైడింగ్లు చేసి ఆ తర్వాత ఆలోచిస్తాను" అని ఎంఎస్ ధోనీ క్లారిటీ ఇచ్చాడు.
ఐపీఎల్ 2025లో ఎంఎస్ ధోనీ 14 మ్యాచ్లలో 145 బంతులు మాత్రమే ఎదుర్కొని 196 పరుగులు చేశాడు. 30 హైయెస్ట్తో 12 ఫోర్లు, 12 సిక్సర్లు నమోదు చేశాడు. గతేడాది 161 పరుగులే చేసిన ధోనీ.. ఈ సారి 196 పరుగులు చేశాడు. 2023లో 104 పరుగులు మాత్రమే నమోదు చేశాడు. ఈ సీజన్లో ధోనీ పగ్గాలు చేపట్టినప్పటికీ సీఎస్కే పదో స్థానంతో సీజన్కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa