ఇంగ్లండ్ - ఇండియా మధ్య జూన్లో ప్రారంభమయ్యే లైవ్ స్ట్రీమింగ్ని వేర్వేరు ప్లాట్ఫామ్స్ దక్కించుకున్నాయి. టీవీలో ప్రసారమయ్యే మ్యాచ్ లైవ్ని సోనీ స్పోర్ట్స్ దక్కించుకోగా.. మొబైల్లో చూసే దానికి జియో హాట్స్టార్ దక్కించుకుంది. ఈ మేరకు క్రిక్బజ్ సమాచారం అందించింది. 2025లో ఇంగ్లండ్ - ఇండియా మధ్య ఐదు టెస్టులు జరగనుండగా, 2026లో ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లన్నీ సోనీ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్లో వీక్షించొచ్చు.
ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ 20 నుంచి ఇంగ్లండ్ వేదికగా భారత్ టెస్టు సిరీస్ ఆడనుంది. దాదాపు రెండు నెలల పాటు ఈ టెస్టు సిరీస్ కొనసాగనుంది. జూన్ 20తో మొదలయ్యే ఈ సిరీస్ ఆగస్టు 04 వరకు కొనసాగనుంది. తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు, రెండో టెస్టు బర్మింగ్హోమ్ వేదికగా జూలై 2 నుంచి 6 వరకు, మూడో టెస్టు జూలై 10 నుంచి 14 వరకు, నాలుగో టెస్టు జూలై 23 నుంచి 27 వరకు, ఐదో టెస్టు జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు జరగనుంది.
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు భారత్ ఏ జట్టు నాలుగు రోజుల మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా ఇంగ్లండ్కు చేరుకోనుంది. శుభమన్ గిల్ సారథ్యంలో మొత్తం 18 మందితో కూడిన యువకుల బృందాన్ని బీసీసీఐ సెలక్ట్ చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత జరిగే ఈ సిరీస్ టీమిండియాకు కీలకంగా మారనుంది.
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa