ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది

national |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 08:10 PM

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ఈ నేపథ్యంలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్  డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ కీలకమైన సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ల గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని, అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వం మరియు ఇతర సంబంధిత ఏజెన్సీలు నిశితంగా గమనిస్తున్నాయని డాక్టర్ బహల్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, క్యాన్సర్ రోగులు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈరోజు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా మొత్తం 1,009 క్రియాశీల కొవిడ్ కేసులు ఉన్నాయి. గత వారం వ్యవధిలో కొత్తగా 750 మందికి కరోనా సోకినట్లు వెల్లడించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa