ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంజయ్ రౌత్, ఉద్ధవ్ ఠాక్రేలకు పిచ్చి పట్టింది....: బీజేపీ

national |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 07:37 PM

ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ముష్కరులు పురుషులను, ముస్లిం కాని వారినే లక్ష్యంగా చేసుకుని 26 మందిని చంపేశారు. ఇందుకు ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. వందల మంది ముష్కరులను హతమార్చింది. కానీ దాడికి పాల్పడ్డ ఆరుగురు ఉగ్రవాదులను మాత్రం ఇప్పటికీ పట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఇదే విషయమై మాట్లాడుతూ.. బీజేపీ సర్కారు వీరిని ఇంకా పట్టుకోలేదంటే వారు బీజేపీలో చేరే అవకాశం ఉందంటూ కామెంట్లు చేశారు. అయితే తాజాగా దీనిపై బీజేపీ స్పందించింది. సంజయ్ రౌత్, ఉద్దవ్ ఠాక్రేలకు పిచ్చి పట్టిందని.. అందుకే వారలా మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించింది. వారిని వెంటనే మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలంటూ కూడా చెప్పుకొచ్చింది.


పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ ఆరుగురు ఉగ్రవాదులు బీజేపీలో చేరినా చేరవచ్చని సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒకరోజు ఇందుకు సంబంధించిన ప్రెస్ నోట్ కూడా విడుదల చేసే అవకాశం ఉందన్నారు. ఈనేపథ్యంలోనే బీజేపీ నేత రామ్ కదమ్ సంజయ్ రౌత్ సహా ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ నాయకులు అందరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన (ఉద్దవ్ ఠాక్రే) పార్టీ నాయకులైన ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ సహా ఇతర నాయకులు పిచ్చి పట్టినట్లుగా మాడ్లాతున్నారని బీజేపీ మండిపడింది. వారిని వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఉద్ధవ్ ఠాక్రే, అలాగే ఆయన పార్టీలో సంజయ్ రౌత్ సహా ఇతర నాయకులు మతి స్థిమితం కోల్పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, వాళ్లు మెంటల్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాలని రామ్ కదమ్ మండిపడ్డారు. అదే విధంగా ఏక్‌నాథ్‌ షిండే వర్గం శివసేన నేత సంజయ్ నిరుపమ్ కూడా రౌత్ వ్యాఖ్యలపై స్పందించారు. ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన నేతలు ఎన్డీయే కూటమిలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ అందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ఫ్రస్ట్రేషన్‌లో ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. రౌత్ వ్యాఖ్యలు భారత జవాన్‌లకు అవమానకరమని అన్నారు.


కొన్ని రోజుల క్రితం కూడా సంజయ్ రౌత్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడులను ఆపే విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. ఇందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాధ్యత తీసుకుని పదవికి రాజీనామా చేయాలని కూడా సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa