ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఆర్సీబీ ఫైనల్కు చేరగా.. ఇవాళ సాయంత్రం గుజరాత్, ముంబై మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో ఆ జట్టు ఫైనల్ బెర్తు దక్కించుకోనుంది. అయితే 9 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఫైనల్కు చేరుకుంది. కానీ ఐపీఎల్ కప్ కోసం 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్.. ఈసారైనా కప్ కొట్టాలని కోరుకుంటున్నారు. ఆర్సీబీ ఫైనల్ చేరుకుంటేనే ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదంటే.. ఇక కప్ దక్కించుకుంటే.. 18 ఏళ్ల ఆకలి తీరినట్టేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కర్ణాటకకు చెందిన ఓ ఆర్సీబీ ఫ్యాన్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ఈసారి ఆర్సీబీ.. ఐపీఎల్ ఫైనల్ గెలిచి కప్ కొడితే.. ఆ రోజును రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించాలని ఆ లేఖలో కోరాడు.
కర్ణాటకలోని బెళగావికి చెందిన ఆర్సీబీ ఫ్యాన్ శివానంద్ మల్లన్నవర్.. సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశాడు. ఇప్పటికే ఆర్సీబీ ఫైనల్కు చేరుకోగా.. మరో టీమ్ ఏది అనేది ఆదివారం జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్తో తేలిపోనుంది. ఐపీఎల్ ఫైనల్ జూన్ 3వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక ఆ రోజు గనక ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్లో గెలిస్తే.. ఆ రోజును 'ఆర్సీబీ ఫ్యాన్స్ ఫెస్టివల్'గా మార్చాలని సీఎంకు శివానంద్ మల్లన్నవర్ విజ్ఞప్తి చేశాడు. అదే రోజును ఏటా సెలవుగా కొనసాగించాలని కోరాడు. ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు.. శివానంద్ మల్లన్నవర్ రాసిన ఈ విజ్ఞప్తి లేఖ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ప్రతీ సంవత్సరం రాష్ట్ర పండగ అయిన కర్ణాటక రాజ్యోత్సవను ఎలా జరుపుకుంటామో ఇక నుంచి ఆర్సీబీఫ్యాన్స్ ఫెస్టివల్'ను కూడా అలాగే జరిపేలా పబ్లిక్ హాలిడేను ప్రకటించాలని వేడుకున్నాడు. ఆర్సీబీ ఐపీఎల్ గెలిచిన విజయానికి గుర్తుగా ప్రతీ సంవత్సరం ఆ రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటామని వెల్లడించాడు. అంతేకాకుండా ఆరోజున రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. ఇందుకోసం కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని విజ్ఞప్తి చేశాడు. గురువారం రోజున జరిగిన ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసి.. ఆర్సీబీ ఫైనల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
మరోవైపు.. ఆర్సీబీ కప్ గెలవాలని ఫ్యాన్స్ రకరకాల కోరికలు కోరుకుంటున్నారు. ఆర్సీబీ ఫైనల్లో గెలిస్తే.. తాను తన భర్తకు విడాకులు ఇస్తానంటూ ఒక మహిళ ప్లకార్డు చూపించిన ఘటనకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. "ఆర్సీబీ ఫైనల్ గెలవకపోతే నేను నా భర్తకు విడాకులు ఇస్తాను" అని ఆ ప్లకార్డుపై రాసి ఉండగా.. ఆ ఫోటోను ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa