రక్షణ మంత్రి రాజ్నాథ్గ పనాజీలో అరేబియా సముద్రంలోని ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకను శుక్రవారం సందర్శించి.. నౌకాదళ సిబ్బందితో సంభాషించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్కు ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నౌకాదళం యుద్ధంలో పాల్గొని ఉంటే, పాకిస్థాన్ 1971 యుద్ధంలాగా రెండు కాదు నాలుగు ముక్కలుగా విడిపోయేది అని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, ‘ఉగ్రవాదుల హఫీజ్ సయీద్, మసూద్ అజర్లను భారత్కు అప్పగించాలి.. పాకిస్థాన్ తరచూ వార్తల కోసం సిద్ధంగా ఉన్నాం’ అంటూ ప్రకటిస్తున్నప్పటికీ, ఇది కేవలం మాటలకే పరిమితమవుతుంది.. నిజమైన శాంతికోసం ఉగ్రవాద నిర్మూలనపై పాక్ సంకల్పం చూపించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.
‘1971 యుద్ధంలో నౌకాదళం దెబ్బకు పాకిస్థాన్ రెండు ముక్కలైంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా నౌకాదళం యుద్ధంలో చురుకుగా పాల్గొని ఉంటే అది నాలుగు ముక్కలయ్యేదీ’ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో నౌకాదళం సైలెంట్గా పనిచేసింది.. అయినా కూడా, పాకిస్థాన్ నౌకాదళాన్ని తీరానికే పరిమితం చేయడంలో భారత నౌకాదళం విజయవంతమైంది. వారు సముద్రంలోకి రావడానికి సాహసించలేకపోయారు’ అన్నారు. INS విక్రాంత్ ఆధ్వర్యంలోని క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ (CBG), MIG-29K యుద్ధ విమానాలు, ఎయిర్బోర్న్ హెలికాప్టర్లతో కలసి నౌకాదళం సముద్రంపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పాకిస్థాన్ వాయుసేన మక్రాన్ తీరం నుంచి సముద్రంలోకి రాకుండా అడ్డుకోవడంలో నౌకాదళం విజయవంతమైంది. నౌకాదళ యుద్ధనౌకలు దక్షిణ, పశ్చిమ తీరాల్లో క్షిపణి ప్రయోగాలు చేసి శక్తివంతమైన సందేశాన్ని పంపాయి.
ఇది కేవలం వార్మప్ మాత్రమే
పాకిస్థాన్ భవిష్యత్లో ఏదైనా దాడికి సాహసం చేస్తే, ఈసారి భారత నౌకాదళం కూడా యుద్ధంలో పాల్గొంటుంద.. ఇప్పుడు జరిగిందంతా కేవలం వార్మప్ మాత్రమే’ అంటూ రాజనాథ్ సింగ్ గట్టి హెచ్చరికలు పంపారు. ‘మీరు యుద్ధంలోకి రాకుండానే మీ సంసిద్ధతతో శత్రువుని భయపెట్టారు. మీ శక్తి చూస్తేనే వారు భయపంతో వెనక్కిపోతారు’ అని INS విక్రాంత్ నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి అన్నారు. 1971 బంగ్తాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్థాన్ను భారత నౌకాదళం చావుదెబ్బ కొట్టింది. దాయాదికి ఆర్ధిక రాజధానిగా గుర్తింపు పొందిన కరాచీ పోర్టుపై దాడిచేయడంతో పాక్ యుద్ధంలో లొంగిపోయింది. నేవీ ఆపరేషన్ ట్రైడెంట్తో డిసెంబరు 4 కరాచీ పోర్టును స్వాధీనం చేసుకుంది. అందుకే ఏటా డిసెంబరు 4న భారత నౌకాదళ దినోత్సవంగా జరుపుకుటుంది.
భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్.. 2022లో నౌకాదళంలో చేరింది. ఇది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపట్టిన ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమానికి ఒక మచ్చు తునక. ఇక, భారత్-ఫ్రాన్స్ మధ్య ఒప్పందం ప్రకారం.. భారత నౌకాదళానికి 26 రాఫేల్ మెరైన్ యుద్ధవిమానాలు అందుబాటులోకి రానున్నాయి. INS విక్రాంత్కు ఇప్పటికే ఉన్న MIG-29Kతో పాటు, శాటిలైట్ నిఘా వ్యవస్థ మరింత సామర్థ్యాన్ని అందించనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa