కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల వ్యక్తిని దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. బాబాజాన్ అనే వ్యక్తి నుంచి 188 గ్రాముల బంగారు ఆభరణాలు, 550 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.1500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ దొంగతనం కేసు విచారణలో పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. బాబాజాన్ అనే వ్యక్తికి మూడు ఫ్యామిలీలు ఉన్నట్లు గుర్తించారు. అతడికి ముగ్గురు భార్యలు, 9 మంది పిల్లలు ఉన్నారని.. వారిని పోషించుకోవడానికి దొంగగా మారినట్లు పోలీసులు తెలిపారు.
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం కేసు నమోదైందని.. ఒక పోలీస్ అధికారి వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగి విచారణ చేయగా.. బాబాజాన్ దొరికినట్లు చెప్పారు. ఈ అరెస్ట్తో 8 మంది దొంగతనం కేసులను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉండటంతో వారిని పోషించడం బాబాజాన్కు కష్టంగా మారిందని.. అందుకే దొంగగా మారాడని తెలిపారు. ప్రాథమికంగా చూస్తే ఈ కేసులో ఇదే తెలిసిందని వెల్లడించారు.
అయితే బాబాజాన్ తన ముగ్గురు భార్యలను బెంగళూరు శివార్లలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. అనేకల్ సమీపంలోని శికారిపాళ్యలో ఒక ఫ్యామిలీ.. చిక్కబళ్లాపురంలో ఇంకో ఫ్యామిలీ.. ఇక చివరి కుటుంబాన్ని శ్రీరంగపట్నంలో నివాసం ఉంచినట్లు పోలీసులు తెలిపారు. బాబాజాన్ తన ముగ్గురు భార్యలు, 9 మంది పిల్లలతో నిత్యం టచ్లో ఉంటున్నాడని.. వారందరి పోషణను అతడే చూసుకునేవాడని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa