ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నై వందేభారత్ రైళ్లలో నాన్-వెజ్ అల్పాహారం బంద్

national |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 07:24 PM

మాంసాహార ప్రియులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా చెన్నై నుంచి బెంగళూరు, మైసూరు, తిరునెల్వేలి, నాగర్‌ కోయిల్ వరకు వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో తాజాగా నాన్ వెజిటేరియన్ బ్రేక్‌ఫాస్ట్‌ను మెనూ నుంచి తొలగించింది. అయితే దీనిపై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోయినప్పటికీ.. మాంసాహార అల్పాహారం అందించకపోవడంతో ప్రయాణికుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా టిఫిన్ బుకింగ్ సమయంలో మాంసాహార అల్పాహారం లేదని పాప్ అప్ నోటిఫికేషన్ వస్తోంది. ఆపూర్తి వివరాలు మీకోసం.


ప్రయాణికుల సమాచారం మేరకు.. IRCTC యాప్‌లో టికెట్ బుకింగ్ సమయంలో నాన్ వెజ్ ఆప్షన్ కనిపిస్తోందని.. కానీ ప్రయాణంలో మాత్రం బ్రేక్‌ఫాస్ట్‌గా నాన్ వెజ్ ఐటెమ్స్ అందుబాటులో లేవని చెప్పారు. అదనంగా నాన్ వెజ్ ఆప్షన్ లంచ్ మరియు డిన్నర్‌కి మాత్రమే వర్తించనుంది అనే సందేశం.. పాప్ అప్ నోటిఫికేషన్‌లో చూపిస్తోందని చెప్పుకొచ్చారు. అయితే బ్రేక్‌ఫాస్ట్ విషయంలో స్పష్టత లేకపోవడంతో ప్రయాణికులు అంతా తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆహార మెనూలో మార్పుల గురించి అధికారిక ప్రకటన లేకపోవడం, ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


ఒకవేళ ఆరోగ్య కారణాలు, ప్రజా అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని మార్పులు చేసినా.. కనీసం ప్రయాణికులకు ముందే తెలియజేయాల్సిన బాధ్యత రైల్వే అధికారులకు ఉందని ప్రయాణికులు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. ఇదే సమయంలో.. కొంతమంది ప్రయాణికులు రైల్లో అందించబడే ఆహార నాణ్యతపై కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార ఎంపికలో వ్యక్తిగత ప్రాధాన్యతలకు గౌరవం కల్పించకపోవడమే కాకుండా, సరైన సమాచారంలో లోపం వల్ల సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై రైల్వే శాఖ, IRCTC నుండి స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు, ప్రయాణ హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు. మరి దీనిపై దక్షిణ మధ్య రైల్వే స్పందిస్తుందా.. స్పందించినా ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa