ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనసు మార్చుకున్న ముస్కాన్ రస్తోగి.... ఇప్పుడేమో?

national |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 07:30 PM

ప్రేమించి పెళ్లాడిన నేవీ అధికారి అయిన భర్తను.. ప్రియుడితో కలిసి చంపేసి ఆపై 15 ముక్కలుగా నరికి డ్రమ్ములో పెట్టి సిమెంట్‌తో సీల్ చేసిన ముస్కాన్ రస్తోగి గురించి అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు తనను ప్రియుడితో ప్రత్యేక సెల్‌లో ఉంచాలంటూ డిమాండ్ చేసిన ముస్కాన్.. గర్భం దాల్చిన తర్వాత తన మనసు మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు ఆమె మరో కొత్త డిమాండ్ చేస్తున్నట్లు జైలు అధికారుల తాజా నివేదికలో వెల్లడైంది. ఆమె ఏం డిమాండ్ చేస్తోందంటే..


మీరట్ జైలులో ఉన్న ముస్కాన్ రస్తోగి.. తనను వేరుగా ఇతర సెల్‌లో కాకుండా తన ప్రియుడితోనే ఒకే సెల్‌లో ఉంచాలని డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడు తన మనసు మార్చుకుని తాను చదువుకుంటానని, తనను చదివించాలని డిమాండ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తాను న్యాయశాస్త్రం చదువుకుంటానని, ఆ తర్వాత తన కేసును తానే వాదించుకుంటానని అడుగుతున్నట్లు జైలు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ముస్కాన్ రస్తోగి డిమాండ్‌ను తాము నెరవేరుస్తామని తనని తన ఇష్టప్రకారం చదివిస్తామని జైలు అధికారులు చెబుతున్నారు. అయితే తను ముందుగా సీనియర్ సెకండరీ పూర్తి చేయాలని పేర్కొంటున్నారు.


ఆమె చదువుకు కావాల్సిన వసతులన్నీ కల్పిస్తాం..


"ముస్కాన్ రస్తోగి జైలులో ఉన్నప్పటి నుంచి ఆమె కుటుంబం నుంచి తనను చూడటానికి ఎవరూ రాలేదు. సాహిల్ అమ్మమ్మ, సోదరుడు అతన్ని కలుస్తున్నారు. ఇప్పుడు ముస్కాన్ న్యాయ విద్యను అభ్యసిస్తానని కోరింది. తన కోరికను మేము పరిగణనలోకి తీసుకుంటాం. ఆమె చదువుకోవాలనుకుంటే, అందుకు అవసరమైన అన్ని వనరులు కల్పిస్తాం." అని జైలు సూపరింటెండెంట్ వీరేషన్ రాజ్ శర్మ తెలిపారు.


 ముస్కాన్ రస్తోగి తన ప్రియుడు సాహిల్‌తో కలిసి మర్చంట్ నేవీ ఆఫీసర్ అయిన తన భర్తను అతి కిరాతకంగా చంపింది. ఆపై ముక్కలు చేసి డ్రమ్ములో సిమెంట్‌తో సీల్ వేసింది. ఈ హత్యోదంతంపై మీరట్ పోలీసులు 1000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. రాజ్‌పుత్‌ను అతని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్.. మొదట మత్తుమందు ఇచ్చి, కత్తితో పొడిచి చంపారని ఆరోపించారు. ఆ తర్వాత సాహిల్‌.. రాజ్‌పుత్‌ మృతదేహాన్ని ముక్కలుగా నరికి, బ్లూ కలర్ డ్రమ్ములో వేసి పై నుంచి సిమెంట్‌తో సీల్ చేసినట్లు ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు. తన తండ్రిని డ్రమ్‌లో ఉన్నాడంటూ రాజ్‌పుత్‌ ఆరేళ్ల కుమార్తె పొరుగు వారికి చెప్పగా హత్యోదంతం బయటకు వచ్చినట్లు అందులో పేర్కొన్నారు.


ప్రస్తుతం జైల్లో ఉన్న ఆమె గర్భం దాల్చినట్లు కూడా ఇప్పటికే జైలు అధికారులు వెల్లడించారు. అయితే ఆ బిడ్డ నేవీ ఆఫీసర్‌కే పుట్టి ఉంటే.. బిడ్డను దత్తత తీసుకోవడానికి తాము సిద్ధం అని సౌరభ్ సోదరుడు బబ్లూ రాజ్ పుత్జ్‌ పేర్కొన్నారు. చూడాలి మరి ఈమెకు పుట్టబోయే బిడ్డ ఎవరి వద్ద ఉండబోతుందనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa