ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ లక్షణాలు ఉంటే పిల్లలను అస్సలే బడికి పంపకండి..: సర్కారు సూచన

national |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 07:41 PM

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చాలా నెలల తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు రావడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా నిర్ధారణ టెస్టులు పెంచితే కేసులు మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లోనే పాఠశాలలు కూడా ప్రారంభం కాబోతుండగా.. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు కరోనా కేసుల పెరుగుదల, మరోవైపు వేసవి సెలవుల తర్వాత పునఃప్రారంభం కానున్న పాఠశాలలు.. ఈ నేపథ్యంలో కర్ణాటక సర్కారు కీలక సూచనలు చేసింది. ఈ మేరకు ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో జ్వరం, దగ్గు, జలుబు సహా ఇతర కరోనా లక్షణాలు ఉంటే వారిని పాఠశాలలకు పంపవద్దని తల్లిదండ్రులను కర్ణాటక సర్కారు కోరింది.


అసలు సర్క్యులర్‌లో ఏముందంటే?


ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన మే 26వ తేదీన జరిగిన కరోనా పరిస్థితి సమీక్షా సమావేశంలో వైద్యాధికారులు, వైద్య నిపుణులు అందించిన సూచనల మేరకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అందులో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అన్నీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషన్ వెల్లడించింది. పాఠశాల పిల్లల్లో జ్వరం, దగ్గు, జలుబు సహా ఇతర లక్షణాలు కనిపిస్తే.. పిల్లలను పాఠశాలలకు పంపవద్దని సూచించింది. అలాగే వైద్యుల సలహా మేరకు తగిన చికిత్స అందిస్తూ సంరక్షణ చర్యలు పాటించాలి" అని శుక్రవారం ఆలస్యంగా జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొxof.


ముఖ్యంగా జ్వరం, దగ్గు, జలుబు, ముక్కు కారడం, కడుపు నొప్పి లాంటి లక్షణాలు ఉన్న పిల్లలు పాఠశాలలకు వస్తే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఇంటికి పంపించాలని, పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిలో కరోనా లక్షణాలు కనిపిస్తే, తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. అంతేకాకుండా పరిశుభ్రత పాటించాలని, చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని, మాస్క్‌ ధరించాలని సదరు సర్క్యులర్‌లో పేర్కొన్నారు.


దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 2,710కి పెరిగింది. గత 24 గంటల్లో ఏకంగా కరోనా కారణంగా ఏడుగురు మృతి చెందారు. అత్యధికంగా కేరళలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. కేరళలో 1,1147 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత ఎక్కువగా మహారాష్ట్రలో(242) కేసులు వెలుగు చూశాయి. దిల్లీలో 294 కేసులు, గుజరాత్‌లో 223 కేసులు, కర్ణాటక, తమిళనాడులో 148 చొప్పున కేసులు నమోదు అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa