ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు 1 నుంచి UPI యాప్‌తో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్‌కు కొత్త నిబంధన

Technology |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 11:47 AM

ఆగస్టు 1, 2025 నుంచి యూపీఐ (UPI) యాప్‌ ద్వారా వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను రోజుకు 50 సార్లు మాత్రమే పరిశీలించుకోవచ్చు. ఈ కొత్త నిబంధనను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. బ్యాంకులు మరియు యూపీఐ సేవల సంస్థలకు ఈ మేరకు ఆదేశాలు అందాయి.
అంతేకాకుండా, విజయవంతమైన లావాదేవీల సమాచారంతో పాటు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ వివరాలను కూడా వినియోగదారులకు తప్పనిసరిగా పంపాలని NPCI బ్యాంకులకు సూచించింది. ఈ నిబంధనలు యూపీఐ వినియోగంలో పారదర్శకతను పెంచడం, సాంకేతిక ఒత్తిడిని నియంత్రించడం కోసం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 
ఈ మార్పుల వల్ల యూపీఐ వినియోగదారులు తమ బ్యాంక్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేసే విధానంలో పరిమితులు ఎదుర్కొనవచ్చు, కాబట్టి రోజువారీ లావాదేవీలను ప్లాన్ చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని సూచన.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa