ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ జూన్ 4న అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు రాష్ట్ర అతిథి హోదా కల్పించే అవకాశం ఉంది. రామాలయ సందర్శన ఆయన ప్రణాళికలో భాగమని అధికారులు తెలిపారు. అయోధ్యలో ఉన్న సీనియర్ అధికారులు మస్క్ దర్శనం కోసం ఆలయ ట్రస్టుతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర అతిథికి ఇచ్చే ప్రోటోకాల్ మస్క్కు వర్తిస్తుందా లేదా అని పరిశీలిస్తామని అయోధ్యలోని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. మస్క్ ప్రస్తుతం ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారతదేశంలో ఉన్నారు. ఈ సమయంలో ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఆయన పర్యటన, రామాలయంలోని మొదటి అంతస్తులో రామ్ దర్బార్ విగ్రహ ప్రతిష్ఠాపన ఒకే సమయంలో జరగనున్నాయి.
సాధారణంగా రాష్ట్ర అతిథి ప్రోటోకాల్లో భద్రతా సిబ్బందితో కూడిన వాహనం కేటాయిస్తారు. విమానాశ్రయంలో అతిథిని రిసీవ్ చేసుకోవడానికి ఒక అధికారి ఉంటారు. ఆ అధికారి అతిథితో పాటు నగరంలోనే ఉంటారు. అదే సమయంలో అయోధ్య రామాలయంలో రామ్ దర్బార్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుండటం మరో విశేషం. ఈ కార్యక్రమం అయోధ్య రామాలయంలోని మొదటి అంతస్తులో జరుగుతుంది.
తన కొడుకు ఎలాన్ మస్క్ ఇండియాకు వచ్చి కాస్త విశ్రాంతి తీసుకోవాలని ఎరోల్ మస్క్ సూచించారు. ఎలాన్ మస్క్ ఇంకా భారత్కు రాకపోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన అన్నారు. అంతేకాకుండా, భారతీయ ఆధ్యాత్మికతపై తనకున్న గౌరవాన్ని వ్యక్తపరిచారు. అలాగే శివుడిని ప్రపంచమంతా అనుసరించాలని ఆయన సూచించారు. ఎలాన్ మస్క్ చాలా ఉత్సాహంగా ఉంటాడని ఎరోల్ మస్క్ చెప్పారు. ఎలాన్ మస్క్కు మీరేం సలహా ఇస్తారని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా.. ముందు కాస్త రెస్టు తీసుకోమని చెబుతానని, ఆ తర్వాత భారత్లో పర్యటించాలని సూచిస్తానని ఎరోల్ మస్క్ చెప్పుకొచ్చారు. ఎలాన్ మస్క్ వయసు ఇప్పుడు 53 సంవత్సరాలు కానీ, అతను 30 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడని ఆయన అన్నారు.
భారత్ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంని ఎరోల్ మస్క్ చెప్పారు. ప్రాచీన భారత సాంస్కృతిక వారసత్వంపై తనకున్న అభిమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారతీయ ఆధ్యాత్మికతపై తన గౌరవాన్ని చాటుకున్నారు. "ప్రపంచమంతా శివుడిని అనుసరిస్తే బాగుండేది. నేను నిపుణుడిని కాను, కానీ ఈ ధర్మం పట్ల నాకు ఆసక్తి ఉంది. ఇది చాలా పురాతనమైనది. మనకు ఎంత తక్కువ తెలుసో, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంత ఉందో ఈ ధర్మం చెబుతుంది" అని ఎరోల్ మస్క్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa