ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మతనం ఆవిరై అడవి మృగంగా మారి

national |  Suryaa Desk  | Published : Fri, Jun 06, 2025, 05:27 PM

ఉత్తరాఖండ్‌కు చెందిన అనామిక శర్మకొన్ని నెలల క్రితమే తన భర్తతో విడిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా.. 13 ఏళ్ల కుమార్తెను తనతోనే ఉంచుకుంటోంది. అయితే కుమారుడిని మాత్రం తన భర్త వద్దే ఉంచి వచ్చింది. అతడు కూడా కొడుకును బాగా చూసుకుంటున్నాడు. ఇదంతా బాగానే ఉన్నా అనామిక శర్మ మాత్రం మరో వ్యక్తితో ప్రేమలో పడింది. అంతేకాకుండా అతడితోనే సహజీవనం చేస్తోంది. బిడ్డ తనతోనే ఉండగా.. ఆమెను కూడా వెంట తీసుకెళ్లింది. ఇలా అనామిక శర్మ, ఆమె ప్రియుడు, కుమార్తె ఒకే ఇంట్లో ఉంటున్నారు.


బాధితురాలు సుమారు ఒక నెల పాటు తన తండ్రి వద్ద ఉండటానికి వెళ్లినప్పుడు ఆమె పరిస్థితిని తండ్రి గమనించాడు. ఏం జరిగిందో చెప్పాలని తండ్రి అడగా.. కూతురు తనపై జరుగుతున్న అకృత్యాల గురించి మొత్తం వివరించింది. తల్లి చేయిస్తున్న దారుణాలను వెల్లడించింది. దీంతో జూన్ 3, 2025న, బాధితురాలి తండ్రి ఆమెను రణిపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించాడు. దీంతో ఈ దారుణమై సంఘటన వెలుగులోకి వచ్చింది.


మొదటిసారి జనవరిలో ఆ బాలికపై తొకారులో అత్యాచారం జరిగినట్టు తెలిపింది. అది కూడా తల్లి కళ్లముందే జరిగినట్టు వివరించింది. అప్పటి నుంచి మార్చి వరకు ఆమెపై పలుమార్లు లైంగిక దాడి జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. సుమిత్ పట్వాల్‌తో కలిసి అనామిక శర్మ ఆగ్రా, వ్రిందావన్ లాంటి ప్రదేశాలకు వెళ్లారు. ఆ సమయంలోనూ తల్లి సమక్షంలోనే 8 సార్లు బాలికపై లైంగిక దాడి జరిగినట్టు పోలీసు అధికారి తెలిపారు. ప్రతి సందర్భంలో తన కుమార్తెకు ఇవన్నీ లైఫ్‌లో సాధారణం అని చెప్పి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుస్తోంది.


హరిద్వార్‌లోని చిత్ర టాకీస్ లేన్‌లో అనమికా శర్మ , సుమిత్ పట్వాల్ కలిసి ఒక హోటల్‌ను లీజుకు తీసుకున్నారు. బాలికపై అత్యాచారాలు చాలా వరకు ఇక్కడే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే మీ నాన్నని చంపేస్తామని నిందితులు బెదిరించినట్టు బాలిక తెలిపింది. కానీ, ఈ దాడులను తట్టుకోలేని ఆ బాలిక ఇటీవల విషయం మెత్తాన్ని తన తండ్రికి వివరించింది. దీంతో ఆయన బాలికతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది.


బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్టు తేలింది. దీంతో రణిపూర్ పోలీస్ స్టేషన్‌లో సామూహిక అత్యాచారం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్-పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయించారు. నిందితుల్ని జ్యూడీషియల్ కస్టడీకి పంపారు. ఈ కేసులో మాజీ బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలైన అనమికా శర్మ , ఆమె ప్రియుడు సుమిత్ పట్వాల్‌తో పాటు అతని స్నేహితుడు కూడా లైంగిక దాడుల్లో పాల్గొన్నట్లుగా గుర్తించారు. అయితే, అతడి స్నేహితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. అయితే, అనామికా శర్మ 2024లోనే పార్టీ విడిచి వెళ్లినట్టు బీజేపీ ఒక లెటర్ విడుదల చేసింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతుండటంతో త్వరలోనే అసలు నిజాలు ఇంకా బయటకొచ్చే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa