ప్రకాశం జిల్లా పొదిలిలో జూన్ 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనను ముందుచూశి స్థానిక వైసీపీ నేతలు శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జగన్ హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంగణాన్ని జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రత్యేకంగా పరిశీలించారు. ఏర్పాట్లను సజావుగా చేపట్టాలని, భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు అధికారులతో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ, "పొగాకు రైతులను పరామర్శించేందుకు జగనన్న ఈ పర్యటన చేపడుతున్నారు. వారి సమస్యలు నేరుగా విని, పరిష్కార మార్గాలను సూచించేందుకు ఆయన వస్తున్నారు," అని తెలిపారు.
పర్యటన నేపథ్యంలో పోలీస్ శాఖ, పార్టీ కార్యకర్తలు, రైతుల సంఘాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa