ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం ప్రాజెక్ట్‌ను ప్రమాదంలోకి నెట్టేలా కూటమి వ్యవహరిస్తోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 09, 2025, 05:34 PM

కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్ట్‌ను సీఎం చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నాడని మాజీ ఎంపీ, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమహేంద్రవరం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలను తాజాగా ప్రాజెక్ట్‌ను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ తన నివేదికలో బయటపెట్టిందని అన్నారు. సీడబ్ల్యుసీ ఆమోదించిన దానికి భిన్నంగా డయాఫ్రం వాల్ డిజైన్లు, కాంక్రీట్ నాణ్యతలో ప్రమాణాలు లేకపోవడం, లోపభూయిష్టమైన విధానాలతో మొత్తం ప్రాజెక్ట్‌నే ప్రమాదంలోకి నెట్టేట్టుగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరంపై ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, అంతర్జాతీయ నిపుణుల కమిటీ చేసిన సిఫారస్‌ల మేరకు ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్ళాలని డిమాండ్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa