ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టెలివిజన్ డిబేట్లో పాల్గొన్న సందర్భంగా ఆమె తీవ్ర స్థాయిలో జగన్ను తప్పుబట్టారు.
"జగన్ వెధవన్నర వెధవ" అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, "జగన్ పుట్టగానే విజయమ్మ ఆయన గొంతు పిసికి చంపేసి ఉంటే ఈ రాష్ట్రానికి పీడ విరిగేది" అనే వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదాస్పదంగా నిలిచారు.
అమరావతి విషయంపై మీడియా చర్చలో ఆమె మాట్లాడుతూ, జగన్ సర్కార్ అమరావతి అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరించిందని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడి, రాష్ట్రాన్ని వెనక్కి తిప్పారన్నారు.
సాక్షి టీవీలో అమరావతి పై వస్తున్న నిరాధార ఆరోపణలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "అసలు జగన్కి రాష్ట్రాభివృద్ధిపై ఎలాంటి స్పష్టత లేదని, మొదటి నుంచీ అమరావతిని తుంచే ప్రయత్నాల్లో ఉన్నారని" ఆమె మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇప్పటికే YSRCP వర్గాలు, పార్టీ అభిమానులు ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నా, కాంగ్రెస్ వర్గం మాత్రం ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa