ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అహ్మదాబాద్ నగరంలో కూలిపోయిన ఘటనపై బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

international |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 05:50 PM

లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నగరంలో కూలిపోయిన ఘటనపై బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటన గురించి తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని ఆయన తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలింది. ఇందులో 242 మంది ఉండగా, వారిలో 53 మంది బ్రిటన్ పౌరులే.ఈ ఘటనపై కీర్ స్టార్మర్ 'ఎక్స్' ద్వారా స్పందించారు. "భారతదేశంలోని అహ్మదాబాద్ నగరంలో, లండన్ బయల్దేరిన విమానం కూలిపోయిన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ విమానంలో అనేక మంది బ్రిటిష్ జాతీయులు కూడా ఉన్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు నాకు వివరిస్తున్నారు. ఈ తీవ్ర మనోవేదన కలిగించే సమయంలో ప్రయాణికులు మరియు వారి కుటుంబ సభ్యులకు నా ప్రార్థనలు అండగా ఉంటాయి" అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు, బాధితుల వివరాలు వంటి అంశాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa