అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. "ఈ ప్రమాదం హృదయవిదారకమైనది. ప్రయాణికులు, విమాన సిబ్బంది కుటుంబాలు అనుభవిస్తున్న బాధ, ఆందోళన ఊహకు అందనివి. ఈ అత్యంత క్లిష్ట సమయంలో వారందరికీ నా ఆలోచనలు తోడుగా ఉంటాయి" అని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి, సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టడం అత్యంత కీలకమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. "ప్రతి ప్రాణం విలువైనదే, ప్రతి సెకను కీలకమైనది. కాబట్టి, అత్యవసర సహాయక చర్యలు వెంటనే అందాలి" అని ఆయన స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో ఉండి, బాధితులకు తమకు సాధ్యమైనంత సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ మేరకు రాహుల్ గాంధీ తన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన వారికి, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన సమయమిదని, మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి, బాధితులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa