గుజరాత్లో ఎయిరిండియా విమానం కుప్పకూలి దాదాపు 274 మంది మరణించిన ఘటన నేపథ్యంలో, విమానాల్లో సాంకేతిక సమస్యలపై పైలట్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని కోల్కతా విమానాశ్రయంలో నిలుపుదల చేసి ప్రయాణికులను దించేశారు.శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబయి బయలుదేరిన ఎయిరిండియా విమానం (ఏఐ 180) సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా కోల్కతాలో విమానాన్ని నిలుపుదల చేసి ప్రయాణికులను దించేశారు.దీనికి ఒక రోజు ముందు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ నుంచి కోల్కతా వెళ్లవలసిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో అధికారులు విమానాన్ని విమానాశ్రయంలో నిలిపివేశారు. ఈ వరుస ఘటనలు విమాన ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదాలు తప్పినట్లు భావిస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa