ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు జలప్రవేశం చేయనున్న ‘అర్నాల’

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 18, 2025, 09:24 AM

భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరనుంది. సముద్ర గస్తీ, అన్వేషణ, సహాయ కార్యక్రమాలకు ఉపయోగించేలా రూపొందించిన తొలి యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్‌ (ఏఎస్‌డబ్ల్యు-ఏఎస్‌డబ్ల్యు) ఐఎన్‌ఎస్‌ ‘అర్నాల’ బుధవారం జలప్రవేశం చేయనుంది. విశాఖపట్నం నేవల్‌ డాక్‌యార్డ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి డిఫెన్స్‌ స్టాఫ్‌ చీఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ అధ్యక్షత వహిస్తుండగా, తూర్పు నౌకాదళం చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెంధార్కర్‌ ఆతిథ్యం ఇస్తున్నారు. ఈ నౌకను కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ డిజైన్‌ చేసి తయారు చేసింది. పీపీపీలో భాగంగా ఎల్‌ అండ్‌ టీ షిప్‌ బిల్డర్స్‌ దీనికి సహకారం అందించింది. ఈ తరహా నౌకలు మొత్తం 16 తయారు చేయాలని నేవీ నిర్ణయించింది. అందులో అర్నాల మొదటిది. మహారాష్ట్రలోని చారిత్రాత్మక అర్నాల కోటకు గుర్తుగా దీనికి ఈ పేరు పెట్టారు. గత నెల 8న దీన్ని నేవీ చేతికి అందించగా.. విశాఖలో బుధవారం జలప్రవేశం చేయిస్తున్నారు. అర్నాల 77.6 మీటర్ల పొడవు, 1,490 టన్నుల బరువు ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa