"అంట చూసేలోగా అంతా మాయం అయినట్లు".. తల్లి పక్కనే ఉండగా.. నాలుగేళ్ల చిన్నారిని అడవిలోకి లాక్కెళ్లింది చిరుత. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో కలకలం సృష్టించింది. వాల్పరై ప్రాంతంలో శుక్రవారం (జూన్ 20) ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది చిన్నారి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఘటనతో వాల్పరై ప్రాంతంలో ఆందోళన నెలకొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనోజ్ ముండా, మోనికా దేవి దంపతుల కుమార్తె రోషిణి కుమారి. వీరు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, రోషిణి పెద్ద కుమార్తె. ఈ దంపతులు గత సంవత్సరం వాల్పరైకి వచ్చి పచ్చమలై సౌత్లోని ఎస్టేట్లో పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో మోనికా దేవి తన ఇంటి ముందు నిలబడి ఉండగా.. ఒక చిరుతపులి అడవిలో నుంచి వచ్చింది. ఆమె పక్కనే నిల్చున్న రోషిణిపై ఒక్కసారిగా చిరుత దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లింది. ఇదంతా బాలిక తల్లి కళ్ల ముందే జరిగడంతో ఆమె దిగ్భ్రాంతికి గురైంది.
తన కుమార్తెను చిరుతు ఎత్తుకెళ్లడంతో మోనికా దేవి కేకలు వేసింది. ఇది విని అక్కడ పనిచేస్తున్న వారు వెంటనే వచ్చి బాలిక కోసం వెతకడం వెతికారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వాల్పరై ఫారెస్ట్ రేంజర్ సురేష్ కృష్ణన్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే వాల్పరై ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి. గతంలో అక్టోబర్ 19, 2024న ఊసిమలై ఎస్టేట్లో ఒక చిరుతపులి నాలుగు సంవత్సరాల బాలికను చంపేసింది. అది కూడా ఆ చిన్నారి తల్లి ముందే జరిగడం కలకలం రేపింది. అనిల్ అన్సారి, అబ్సరా ఖాతూన్ దంపతుల కుమార్తె (4) అబ్సరా తన తల్లిదండ్రులతో కలిసి వాగులో స్నానం చేయడానికి వెళ్ళింది. అప్పుడు ఒక చిరుతపులి అడవిలో వచ్చి అబ్సరాను పట్టుకుని అడవిలోకి లాక్కెళ్లడానికి ప్రయత్నించింది. అక్కడున్న వాళ్లు వెంటనే స్పందించి ఆ చిన్నారిని చిరుతపులి నుంచి కాపాడారు. కానీ, అప్పటికే ఆ చిన్నారి చనిపోయింది. తాజాగా మరోసారి చిరుత చిన్న పిల్లను ఎత్తుకెళ్డంతో వాల్పరై ప్రాంత ప్రజలను భయాందోళనకు గురవుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని అధికారులు సూచిస్తున్నారు. చిరుతపులుల కదలికలపై నిఘా ఉంచామని, వాటిని పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు భయపడవద్దని, త్వరలోనే పరిస్థితిని అదుపులోకి తెస్తామని భరోసా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa