ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 24, 2025, 02:14 PM

ఏపీ మంత్రివర్గం మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో అమోదం తెలిపిన‌ 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 28,546 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది. వైజాగ్‌ లో కాగ్నిజెంట్ ఏర్పాటుకు సంబంధించి చర్చ జరగనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పనకు రూ. 1052 కోట్లతో టెండర్లు పిలవడానికి కేబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది. సీడ్ యాక్సెస్ రోడ్‌ను నేషనల్ హైవే - 16కు కలిపేందుకు రూ. 682 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అమోదం తెల‌ప‌నుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa