ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 24, 2025, 02:30 PM

భార్యాభర్తల మధ్య జరిగిన వివాదంలో భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో తన ఇద్దరి పిల్లలతో సహా ఆమె బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో తల్లి, కుమారుడు మరణించారు. బావిలో మెట్లు పట్టుకుని కుమార్తె ఉంది. దీంతో స్థానికులు వెంటనే బాలికను రక్షించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బావిలో నుంచి మృతదేహాలను వెలికి తీశారు.అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని తమ దర్యాప్తులో తెలినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కారణంగానే ఆమె విసిగిపోయి.. ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిందని పోలీసులు వివరించారు. ప్రభుత్వం ఇటీవల తల్లికి వందనం పేరిట నగదును ఖాతాలో వేసింది. ఈ ఖాతాలోని నగదును తన ఖాతాలోకి మళ్లించాలంటూ భార్యపై భర్త తీవ్ర ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనితో ఏర్పాటైన వివాదం వలన ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa