జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. చట్ట్యారి-చింగస్ సమీపంలో టెంపో ట్రావెలర్ ఒక మినీ గూడ్స్ వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. టెంపో పూర్తిగా నుజ్జునుజ్జయ్యిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa