రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత, సీనియర్ రాజకీయ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి పార్టీ జాతీయ అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించేందుకు రంగం సిద్ధమైంది. ఆయన ఈ పదవికి వరుసగా 13వ సారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం కేవలం లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. లాలు నిన్న పాట్నాలోని ఆర్జేడీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని, పార్టీ ఎన్నికల అధికారి రామ్చంద్ర పూర్వే సమక్షంలో జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ పదవికి మరెవరూ పోటీలో లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన జూలై 5న వెలువడే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa