ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా అంబటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 07:16 PM

వైసీపీలో కీలక నియామకం జరిగింది. వైసీపీ అధినేత జగన్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబును గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్త (కోఆర్డినేటర్‌)గా నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. అంబటి రాంబాబు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన, 2024 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అంబటి రాంబాబు మొదటి నుంచి పార్టీకి బలమైన గొంతుకగా ఉన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa