ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూసమీకరణ విషయంలో ఇబ్బందుకు రాకుండా చూసుకుంటాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 07:21 PM

అమరావతిలో చేపట్టబోయే భూసమీకరణ విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనలను సవరించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ), సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జలవనరుల పరిరక్షణకు కట్టుబడి ఉంటామన్నారు. అసైన్డ్‌, దేవాదాయ, లంక భూముల విషయంలో జాయింట్ కలెక్టర్ (జేసీ) ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేయించి, సర్వే సమయంలో సరిహద్దుల వద్ద ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక రైతులకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో పునాదులు వేసి, ఆగిపోయిన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయడంపై కేబినెట్ దృష్టి సారించిందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ), హెచ్‌వోడీ టవర్ల నిర్మాణ బాధ్యతలను ఎన్‌సీసీ, ఎల్ అండ్ టీ, షాపూర్ పల్లోంజీ సంస్థలకు అప్పగించనున్నట్లు తెలిపారు. సీఆర్‌డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa