ఏపీలోని గృహ విద్యుత్ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ( APCPDCL ) అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. కరెంట్ ఎక్కువగా వాడుతున్న వారికి.. విద్యుత్ అదనపు లోడును క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అధికంగా కరెంట్ వినియోగిస్తే కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అదనపు లోడును క్రమబద్ధీకరించుకునేందుకు ఏపీసీపీడీసీఎల్ అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే విద్యుత్ అదనపు లోడ్ క్రమబద్దీకరించుకునేందుకు జూన్ 30వ తేదీ వరకే అవకాశం ఉంది. విద్యుత్ అదనపు లోడ్ కోసం గడువులోగా.. దరఖాస్తు చేసుకున్నవారికి ఏపీసీపీడీసీఎల్ కిలోవాట్ విద్యుత్కు 50 శాతం రాయితీ ఇవ్వనుంది. అయితే జూన్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
సాధారణంగా కిలోవాట్ విద్యుత్ అదనంగా ఉపయోగిస్తే.. రూ. 2250 కరెంట్ బిల్లు కట్టాల్సి ఉంటుంది. అయితే ఏపీసీపీడీసీఎల్ ప్రస్తుతం అందిస్తున్న అవకాశం కింద దరఖాస్తు చేసుకుంటే 50 శాతం రాయితీ లభిస్తుంది. దీంతో కిలోవాట్కు రూ.1250 చెల్లిస్తే సరిపోతుంది. విద్యుత్ సర్వీసుకు ఉన్న అధిక లోడ్ క్రమబద్ధీకరించుకోవాలనుకునే వారు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ఏపీసీపీడీసీఎల్ సూచించింది. వినియోగదారులు ఏపీసీపీడీసీఎల్ సర్కిల్స్లోని ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీసు.. లేదా ఈ సేవా కేంద్రాల ద్వారా ఏపీసీపీడీసీఎల్ వెబ్సైట్ సంప్రదించాలని సూచించింది. కావాల్సిన విద్యుత్ లోడుకు తగినంత చార్జీలు చెల్లించి.. విద్యుత్ సర్వీస్కు అదనపు లోడ్ను క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలో నడుస్తోంది. ఏపీసీపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉంది. ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) విభజన తర్వాత డిసెంబర్ 5, 2019న ఏపీసీపీడీసీఎల్ ఏర్పాటైంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణ, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో ఏపీసీపీడీసీఎల్ విద్యుత్ సేవలను అందిస్తుంది. APCPDCL గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేస్తుంది. తాజాగా గృహ విద్యుత్ వినియోగదారుల కోసం ఈ ఆఫర్ తెచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa