ఇటీవలి కాలంలో పెళ్లి అయి భర్త ఉన్న తర్వాత కూడా.. ప్రియుడితో సంబంధాలు సాగిస్తూ.. భర్తను హత్య చేయడం, హత్య చేస్తానని బెదిరిస్తున్న సంఘటనలు పెరిగిపోతుండటం తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏడడుగులు వేసి.. మూడు ముళ్లు వేసిన భర్తను కూడా కడతేర్చేందుకు.. భార్యలు వెనుకాడటం లేదు. ప్రియుడితో కలిసి భర్తను చంపించి.. ఆ తర్వాత సెటిల్ అవుదామని వేస్తున్న ప్లాన్లు.. బెడిసి కొట్టి పోలీసులకు దొరికిపోయి.. జైళ్లో ఊచలు లెక్కపెడుతున్న సంఘటనలు కళ్ల ముందే కనిపిస్తున్నా.. మిగిలిన వాళ్లు మాత్రం వాటిని చూసి కొంచెం కూడా భయపడటం లేదు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. సమాజంలో మానవ సంబంధాలు ఏమై పోతున్నాయనే ఆందోళన ఎక్కువవుతోంది. తాజాగా ఉత్తర్ప్రదేశ్లో ఓ భార్య.. భర్తకు ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. తన ప్రేమకు అడ్డొస్తే.. 55 ముక్కలుగా నరికేస్తానని బెదిరించింది.
ఉత్తర్ప్రదేశ్లోని బందా జిల్లాలో పబ్జీ గేమ్ ద్వారా ఏర్పడిన ప్రేమ కోసం ఆరాధన అనే వివాహిత.. తన భర్త షీలును 55 ముక్కలు చేస్తానని బెదిరించడం కలకలం రేపుతోంది. ఆరాధనకు, మహోబాకు చెందిన షీలు అనే వ్యక్తితో 2022లో పెళ్లి అయింది. వీరికి ఒక ఏడాది కొడుకు కూడా ఉన్నాడు. అయితే.. పెళ్లైన కొద్ది నెలలకే ఆరాధన పబ్జీ గేమ్కు బానిసైంది. ఈ క్రమంలో పంజాబ్లోని లుథియానాకు చెందిన శివమ్ అనే యువకుడితో ఆమెకు పబ్జీ ఆటలో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. తరచూ వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆరాధన ప్రవర్తనలో మార్పు గమనించిన షీలు.. కోపంతో ఆమెను కొట్టాడు. ఈ విషయాన్ని శివమ్కు ఆరాధన చెప్పడంతో.. అతడు నేరుగా మహోబాలోని ఆమె అత్తగారి ఇంటికి చేరుకున్నాడు. ఉన్నట్టుండి శివమ్ రావడంతో షీలుతో పాటు అతని కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. ఆ తర్వాత ఆరాధన.. తన భర్తను, బిడ్డను వదిలి శివమ్తో కలిసి వెళ్లిపోతానని పట్టుబట్టింది.
వీరిద్దరి మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. షీలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు శివమ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆరాధన పోలీస్ స్టేషన్కు వెళ్లి.. తనకు భర్త వద్దని ప్రియుడే కావాలని తెగేసి చెప్పింది. తన భర్త తాగుబోతు అని.. ఎప్పుడూ తనను హింసిస్తూ ఉంటాడని ఆరోపించింది. అయితే తన ప్రేమకు అడ్డుగా వస్తే.. భర్తను 55 ముక్కలుగా నరికి డ్రమ్లో పడేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఇది ఇటీవల జరిగిన మీరట్ హత్య కేసును గుర్తు చేస్తోంది.
శివమ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత.. కోర్టుకు తరలిస్తుండగా.. హై వోల్టేజ్ డ్రామా చోటుచేసుకుంది. వారిని వెంబడించిన ఆరాధన.. తన పబ్జీ లవర్ శివమ్తోనే తాను వెళ్తానని పట్టుబట్టింది. ఇక శివమ్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు.. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa