ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో టెస్టు కోసం ,,,,జిమ్‌లో ప్రత్యక్షమైన రిషబ్ పంత్

sports |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 11:20 PM

ఇంగ్లండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌కి టీమిండియా సిద్ధమవుతోంది. బర్మింగ్ హామ్ వేదికగా జూలై 2 నుంచి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించినా.. బౌలర్లు విఫలమవడంతో మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. మొదటి టెస్టులో సెంచరీల మోత మోగించిన పంత్ రెండో టెస్టులోనూ సత్తా చాటాలని నిర్ణయించుకున్నాడు.


మరో రెండు రోజుల్లో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుండటంతో టీమిండియా వైస్ కెప్టెన్, కీపర్ రిషబ్ పంత్ జిమ్‌లో దర్శనమిచ్చాడు. జిమ్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టే ముందు ఓ ఫొటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌గా పెట్టాడు. జిమ్ గోడల మీద రాసున్న ఒక క్వోట్ కనిపించేలా ఫొటో తీసి పోస్ట్ చేశాడు. నొప్పి అనేది తాత్కాలికమే కానీ మధ్యలో విడిచిపెడితే ఆ పశ్చాత్తాపం జీవితాంతం గుర్తుంటుంది అని రిషబ్ పంత్ పెట్టిన పోస్ట్‌కి అర్థం.


హెడింగ్లీ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లండ్ గడ్డపై రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. రెండో టెస్టులో కూడా సెంచరీలు చేయాలని ఇప్పటి నుంచే స్ట్రాంగ్‌గా ఉంటున్నాడు.


టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత భారత్ చేరుకున్న పంత్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ మళ్లీ తిరిగి టీమిండియాలోకి రాగలడా అనే అనుమానాలు అప్పట్లో వచ్చాయి. కాలికి గాయం కావడంతో కెరీర్ ముగిసిందని అనుకున్నారు. కానీ, పంత్ కబ్ బ్యాక్‌ ఇచ్చి క్రికెట్ మీద తనకున్న ప్యాషన్ నిరూపించుకున్నాడు. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్‌లో రాణిస్తూ కాబోయే సూపర్ స్టార్‌గా ముద్ర వేస్తున్నాడు.


రెండో టెస్టుకు టీమిండియా అంచనా


యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహహ్మద్ సిరాజ్/ఆకాశ్ దీప్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa