గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోగా, ఉన్నవి కూడా తరలిపోవడంతో తీవ్రమైన నిరుద్యోగ సమస్య తలెత్తిందని, దాని ఫలితంగా సుమారు 2,400 మంది యువత ఆత్మహత్య చేసుకున్నారని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ దీపక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం యువతకు మేలు చేస్తుంటే ఓర్వలేక వైసీపీ నాయకులు వారిని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ మూకల అసత్య ప్రచారాలు నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దని, యువత భవిష్యత్కు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని దీపక్ రెడ్డి విమర్శించారు. "ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి జగన్ నిరుద్యోగులను నిలువునా ముంచారు. ఆయన పాలనలో లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రాన్ని వీడిపోయాయి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కంపెనీలతో పాటు చివరకు ఒక అండర్వేర్ కంపెనీని కూడా తరిమికొట్టారు. జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాది అని వెళ్లిపోయిన కంపెనీలే అంటున్నాయి" అని ఆయన ఆరోపించారు. కేంద్రం చెప్పినా వినకుండా విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసి, దాదాపు రూ. 12,250 కోట్లు వినియోగించుకోకుండానే సంస్థలకు చెల్లించారని గుర్తు చేశారు. పోలవరం పనులు ఆపడం వల్ల రాష్ట్రానికి సుమారు రూ. 2 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని, ఈ మొత్తం గత ఐదేళ్లలో జగన్ డీబీటీ ద్వారా ఇచ్చిన దానికి సమానమని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa