వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. పల్నాడు జిల్లాలో సింగయ్య అనే వృద్ధుడి మృతికి సంబంధించిన కేసులో ఆయనపై తదుపరి చర్యలు తీసుకోకుండా రెండు వారాల పాటు స్టే విధిస్తూ న్యాయస్థానం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసుకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో సెక్షన్ను బీఎన్ఎస్ కింద 105కు మార్చారని, అందువల్ల తదుపరి చర్యలు, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు.మరోవైపు, ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు, ఇతర సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచేందుకు తమకు రెండు వారాల సమయం కావాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, రెండు వారాల పాటు ఈ కేసులో ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa