ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బదిలీ టీచర్ల జీతాలపై ఏర్పడిన జాప్యంపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల్లో పొజిషన్ ఐడీలను క్రియేట్ చేయకుండానే నూతన పోస్టుల్ని ఉన్నతీకరించడం, సర్దుబాటు చేయడం వల్ల జూన్ నెల జీతాల క్లెయిమ్కు టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
విద్యాశాఖ మరియు ట్రెజరీ మధ్య సమన్వయం అవసరం అని నల్లపల్లి విజయ్ సూచించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాల సమస్య తక్షణమే పరిష్కరించేందుకు విద్యాశాఖ అధికారులు, ట్రెజరీ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఉపాధ్యాయులు నిత్యజీవన అవసరాల కోసం జీతాలపై ఆధారపడి ఉండటాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.
ఇకపై ఆలస్యం తలెత్తకూడదు అని ఆయన హెచ్చరించారు. ఉపాధ్యాయుల సమస్యలు మానవతా దృష్టికోణంతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం ఉపాధ్యాయులను మరుగున పడేసే ధోరణి మార్చుకోవాలని నల్లపల్లి విజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా తక్షణ జీతాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa