ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పరిటాల సునీత, స్థానిక నాయకులతో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
కార్యక్రమంలో భాగంగా గ్రీన్ కో రాయల విండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. గ్రామ ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. మంచినీటి వనరుల మెరుగుదల గ్రామ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
అంతేకాకుండా, స్థానిక సచివాలయంలో మొక్కలు నాటడం, రైతులకు LRG 52, 105 రకాల కందుల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ప్రకృతి పరిరక్షణతోపాటు వ్యవసాయోత్పత్తిని ప్రోత్సహించేలా తీసుకున్న ఈ చర్యలు గ్రామాభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని నాయకులు అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa