నేడు (బుధవారం) పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. పాలకొల్లు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు.. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై వివరిస్తున్నామని చెప్పుకొచ్చారు. తమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసిన ప్రజలు తమది మంచి ప్రభుత్వమని చెబుతున్నారని పేర్కొన్నారు. పేదరికాన్ని పారద్రోలేలా మార్గదర్శకుల సహకారంతో పీ4ను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అన్నింటినీ అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కూటమి పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే ప్రతి ఇంటికి సంక్షేమాన్ని, ప్రగతిని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని ఉద్ఘాటించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి అప్పుల పాల్జేశారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నష్టం కన్నా.. జగన్ ఐదేళ్ల పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa