ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నామలై, పవన్ కల్యాణ్ లకి అండగా ఉంటాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 03:27 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ నేతలపై తమిళనాడు ప్రభుత్వం కేసు పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వంపై మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్, బీజేపీ నేతలపై తమిళనాడులో కేసు పెట్టడం మురుగన్‌పై దాడిగా భావిస్తామని అన్నారు. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఓటమి తథ్యమని తెలిపారు. దుర్మార్గపు పాలన తమిళనాడులో ఉందని విమర్శించారు. సనాతన ధర్మం నాశనం అయిపోవాలని, వేదాంగాలపైన నీచమైన ఆలోచన కలిగిన ప్రభుత్వం తమిళనాడులో ఉందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(బుధవారం) విజయవాడలో జాతీయ హిందూ ధార్మిక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు, మాధవ్, గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడారు. అన్నామలైకి అండగా పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగారని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌, అన్నామలైకి తాము అండగా ఉంటామని పీవీఎన్ మాధవ్ ఉద్ఘాటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa