ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిగుబడి పెరిగినందుకే మామిడి ధర తగ్గింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 02:43 PM

మామిడి రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. దిగుబడి పెరిగినందుకే మామిడి ధర తగ్గిందని తెలిపారు. రైతులను ఆదుకుంటాం, కేంద్ర ప్రభుత్వ సాయం కూడా తీసుకుంటామని అన్నారు. మామిడి రైతులకు తాము చేసినంత సాయం గతంలో ఎవరైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. శవ రాజకీయాలు చేసే వారు మామిడి రైతులపై ప్రేమ కురిపిస్తున్నారని అన్నారు. రైతుల ఇబ్బందులను తాము పరిష్కరిస్తామని.. రైతులకూ తమపై నమ్మకం ఉందని ఉద్ఘాటించారు. మామిడి రైతుల గురించి.. వ్యవసాయం, హార్టీకల్చర్ గురించి ఏ మాత్రం పట్టించుకోని వారు ఇప్పుడు మాట్లాడతారా, మైక్రో సబ్సిడీలిచ్చారా అని ప్రశ్నించారు. హంద్రీనీవా పనులను తామే చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోనే రూ.3980 కోట్లు ఖర్చు పెడుతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయంలో లాభాలు వస్తాయని తెలిపారు. ఫుట్‌ ప్రాసెసింగ్‌ ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌పై చర్చిస్తున్నామని అన్నారు. మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారాయని చెప్పుకొచ్చారు. ఏ పంట వేస్తే లాభదాయకమో కూడా ఆలోచిస్తున్నామని అన్నారు. తమిళనాడులో లేని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఏపీలో ఉందని ఉద్ఘాటించారు. సుపరిపాలనలో తొలిఅడుగులో భాగంగా ఇంటింటికీ వెళ్తున్నామని వెల్లడించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa