ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు పట్టు బిగిస్తోంది. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా మిడిలార్డర్ బలంగా ఉండటంతో భారీ స్కోర్ దిశగా ముందుకు సాగుతోంది. హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్ వికెట్ పడకుండా యాభై ఓవర్లు ఆడి ఇంగ్లండ్ను తక్కువ పరుగులకే ఆలౌట్ కాకుండా చేశారు. మొదటి సెషన్లో అడుగుపెట్టిన స్మిత్.. బ్రూక్తో కలిసి రెండో సెషన్ వరకూ వికెట్ పడకుండా ఆడటం విశేషం.
రెండో రోజు టీమిండియా బౌలర్లు రాణించడంతో 77/3 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ జో రూట్, బెన్ స్టోక్స్ వెంటవెంటనే అవుటయ్యాడు. కెప్టెన్ స్టోక్స్ గోల్డెన్ డక్గా పెవిలియన్ బాట పట్టడంతో ఇంగ్లండ్ 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలర్ల దూకుడు చూసి ఇంగ్లండ్ త్వరగానే ఆలౌట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు.
భారత్ బౌలర్ల దూకుడుకు హ్యారీ బ్రూక్ , జెమీ స్మిత్ అడ్డుకట్ట వేశారు. 90 బంతుల్లోనే వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఇద్దరు ఆటగాళ్లు.. 138 బంతుల్లోనే 150 పరుగులు బాదారు. అదే ఊపుతో 250 పరుగుల భాగస్వామ్యం కూడా దాటేశారు. ఇంగ్లండ్ జట్టు చివరి వికెట్ 21.4 ఓవర్లలో కోల్పోగా.. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి ఏకంగా 53.2 ఓవర్లు వికెట్ పడకుండా ఆడారు.
జెమీ స్మిత్ టీమిండియా బౌలర్లపై కౌంటర్ అటాక్ చేస్తూ బౌండరీలతో విరచుకుపడ్డాడు. అటు పేస్, ఇటు స్పిన్ ఇద్దర్నీ ఉతికారేశాడు. 80 బంతుల్లో సెంచరీ చేసిన స్మిత్ 150 పరుగులను కూడా పూర్తి చేశాడు. హ్యారీ బ్రూక్ తన కెరీర్లో తొమ్మిదో శతకాన్ని అందుకుని స్కోర్ బోర్డును ముందుకు నడింపించాడు. మూడో రోజు టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీ బ్రూక్ 15 ఫోర్లు, ఒక సిక్సర్తో 140 (209), జెమీ స్మిత్ 19 ఫోర్లు, మూడు సిక్సర్లతో 157 (169) పరుగులతో కొనసాగుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa