కుక్కను ఢీకొట్టిన కారణంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆగిపోయిన ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. విజయవాడ - చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం చీరాల రైల్వేస్టేషన్ సమీపంలో అర్ధాంతరంగా ఆగిపోయింది. చీరాల రైల్వేస్టేషన్కు సుమారు అర కిలోమీటర్ దూరంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది. విజయవాడ- చెన్నై వందే భారత్ రెలుకు చీరాలలో స్టాపింగ్ లేదు. అయినప్పటికీ.. రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఆగిపోవటంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే కుక్కను ఢీకొట్టడంతో విజయవాడ - చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆగిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
కుక్కను ఢీకొనటంతో ఎయిర్బ్రేక్ పట్టేసిందని.. దీంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అర్దాంతరంగా నిలిచిపోయినట్లు తెలిపారు. సుమారుగా 20 నుంచి 25 నిమిషాలు రైలు అక్కడే ఆగిపోయింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు లోకో పైలెట్లు స్థానిక రైల్వే సిబ్బంది సహకారంతో మరమ్మత్తులు చేశారు. దీంతో 27 నిమిషాల తర్వాత చీరాల రైల్వేస్టేషన్ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు బయల్దేరి వెళ్లింది. దీంతో రైల్వే ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు విజయవాడ చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. వారంలో ఆరురోజుల పాటు ఈ రైలు నడుస్తుంది. మంగళవారం మాత్రమే అందుబాటులో ఉండదు. విజయవాడ చెన్నై వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు విజయవాడ నుంచి 6 గంటల 40 నిమిషాల్లోనే చెన్నైకు చేరుకుంటుంది. విజయవాడలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయల్దేరి.. అదే రోజు రాత్రి 10 గంటలకు చెన్నైకి చేరుకుంటుంది. విజయవాడ చెన్నై వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వేస్టేషన్లలో ఆగుతుంది, ఇక చెన్నై నుంచి ఉదయం 5.30 గంటలకు బయల్దేరితే.. మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa