ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం బెల్ట్ షాపులకి కేంద్రంగా కందుకూరు మారింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 10, 2025, 01:00 PM

కరేడు రైతుల అభిష్టానికి భిన్నంగా బలవంత భూసేకరణ ఆపాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే బుర్రా మ‌ధుసూద‌న్‌యాద‌వ్ డిమాండ్ చేశారు. కందుకూరు నియోజకవర్గం కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం బెల్ట్ షాపులు కల్తీ మందుల తయారీకి కేంద్రంగా మారిందని, రేషన్ మాఫియా, ఇసుక దందాకు అడ్డాగా మారిందని ఆరోపించారు. కందుకూరు రేషన్ మాఫియాలో స్థానిక ఎమ్మెల్యేకు వాటా ఉందని, నియోజకవర్గంలో జరిగే ప్రతి పనికి కప్పం కట్టమని హుకుం జారీ చేస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యులు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్  మాట్లాడుతూ.. కరేడు రైతులను వారి అభిప్రాయాలను గౌరవించకుండా బలవంతంగా భూములు సేకరణ చేయడం సమంజసం కాదని రైతుల అవిష్టానికి భిన్నంగా వ్యవహరించరాదని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa