ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 10, 2025, 01:01 PM

సీఎం చంద్రబాబు కుట్రలు, పోలీస్ ఆంక్షలను సైతం ప్రజాభిమానంతో అధిగమించి వైయస్ జగన్ చిత్తూరు పర్యటన విజయవంతంగా జరిగిందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌ రెడ్డి అన్నారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ, అధికార బలంతో రైతుల ఆవేదనను అణిచివేయాలని చూసిన చంద్రబాబుకు ఇది చెంపపెట్టని అన్నారు. మామిడి రైతులను ఆదుకోవడంలో విఫలమైన ఈ ప్రభుత్వం, అండగా నిలిచేందుకు వచ్చిన వైయస్ జగన్ పట్ల చూపిన దుర్మార్గంపై రైతుల నుంచి వచ్చిన ఆగ్రహంతో ప్రభుత్వం తోకముడిచిందని ధ్వజమెత్తారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa