మహారాష్ట్రలో ఎవరూ ఊహించని ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా నెలలు నిండకముందే ఓ మహిళకు ఆడబిడ్డ జన్మించింది. పుట్టిన తర్వాత ఆమె ఏడ్వకపోవడం, శరీరంలో చలనం లేకపోవడంతో.. చనిపోయినట్లు వైద్యులుగా ధ్రువీకరించారు. దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే చిన్నారి తల్లిదండ్రులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకు వచ్చారు. దాదాపు 12 గంటల తర్వాత ఆమెను ఖననం చేసేందుకు తీసుకు వెళ్లారు. అయితే అంత్యక్రియలకు కాసేపటి ముందే శిశువును చూడాలని ఆమె అమ్మమ్మ పట్టుబట్టగా.. శవపేటికను తెరిచారు.
బిడ్డపై కప్పిన బట్టను కూడా తొలగించారు. ఇంతలోనే ఓ అద్భుతం జరిగింది. అప్పటి వరకు అంతా చనిపోయిందనుకున్న ఆ పాప ఒక్కసారిగా కళ్లు తెరిచి ఏడ్వడం ప్రారంభించింది. దీంతో అక్కడున్న కుటుంబ సభ్యులు సహా బంధువులు అంతా షాక్ అయ్యారు. వెంటనే బుజ్జాయిని ఆస్పత్రికి తరలించారు. మరి ఈ ఘటన ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబబాజోగాయిలోని హోల్ గ్రామానికి చెందిన ఓ మహిళ.. జులై 7వ తేదీన స్వామి రామానంద్ తీర్థ్ ఆసుపత్రిలో ఒక ఆడ శిశువుకు జన్మను ఇచ్చింది. అయితే నెలలు నిండకముందే ఈమె ప్రసవించగా.. కేవలం 900 గ్రాముల బరువుతోనే పాపు పట్టింది. తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత పాప ఒంట్లో చలనం లేదు. అలాగే ఆమె ఏడ్వను కూడా ఏడ్వకపోవడంతో.. పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు ధ్రువీకరించారు.
దీంతో శిశువ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక చేసదేమీ లేక బుజ్జాయి మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామానికి వచ్చారు. అంత్యక్రియల కోసం కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఇంటికి వచ్చేసరికే అర్ధరాత్రి కావడంతో మరుసటి రోజు ఉదయమే ఖననం చేయాలనుకున్నారు. రాత్రంతా బుజ్జాయి శవపేటికను పక్కన పెట్టుకుని ఏడుస్తూనే ఉన్నారు.
అయితే తెల్లారగానే నవజాత శిశువుకు అంత్యక్రియలు చేసేందుకు తీసుకెళ్లారు. ఇంకాసేపట్లో ఖననం చేస్తామనగా.. చివరి సారిగా తన మనవరాలు ముఖం చూస్తానని అమ్మమ్మ పట్టుబట్టింది. అప్పటి వరకు బుజ్జాయిని శవపేటికలోనే ఉంచగా.. పాప అమ్మమ్మ కోసం దాన్ని తెరిచారు. అలాగే బుజ్జాయి ముఖం మీద కప్పి ఉంచిన తెల్లని బట్టని కూడా తొలగించారు. అప్పుడే హఠాత్తుగా పాప ఏడ్వడం ప్రారంభించింది. కళ్లు కూడా తెరవడంతో.. కుటుంబ సభ్యులు అంతా షాక్ అయ్యారు. ఊపిరి కూడా తీసుకుంటుండం గమనించి వెంటనే ఆమె ఆస్పత్రికి తరలించారు. శిశువు చనిపోయిందని ఎలా చెప్పారని వైద్యులను ప్రశ్నిస్తూనే.. ఆమె బతికే ఉందని చూపించారు. ప్రస్తుతం చిన్నారికి వైద్య చికిత్సలు అందిస్తుండగా.. ఆసుపత్రి సిబ్బంది, యాజమాన్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
దీంతో స్వామి రామానంద్ తీర్థ్ ఆసుపత్రి ఇన్చార్జ్ డాక్టర్ రాజేష్ కచారే స్పందించారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఈ ఘటనపై తాము తక్షణమే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశామని, ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని ఆయన వివరించారు. శిశువు పుట్టిన తర్వాత కదలికలు లేకపోవడం వల్లే తొలుత తప్పుగా నిర్ధారణ చేసి ఉంటారని డాక్టర్ కచారే ప్రాథమికంగా అభిప్రాయ పడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa