ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇచ్చిన వాగ్దానాలను అమలు చేశామని చెప్పే ధైర్యం కూటమి నేతలకి ఉందా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 13, 2025, 03:34 PM

కూటమి మోసాలపై ప్రజలను చైతన్య పరచాల‌ని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర పిలుపునిచ్చారు. పాచిపెంట మండలం వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో  రాజన్నదొర  పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలే లక్ష్యంగా దాడులకు తెగబడుతూ కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేశామని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పే ధైర్యం కూటమి నాయకులకు ఉందా అని ప్రశ్నించారు.  చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌ తోడు దొంగల్లాగా తయారై రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు, అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా అవేమీ తమకు పట్టవంటూ వ్యవహరిస్తున్నారన్నారు. ప్రశ్నించడానికి పార్టీ స్థాపించానని బీరాలు పలికిన పవన్‌ కళ్యాణ్‌ నేడు పవర్‌ లేని స్టార్‌ గా మిగిలిపోయాడని విమర్శించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa