ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలపై దాడులు చెయ్యడం పరిపాలన అనరు చంద్రబాబు, శాడిజం అంటారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 13, 2025, 03:35 PM

మహిళల మీద ఈరోజు టీడీపీ, జ‌న‌సేన నేత‌ల దాడి, చంద్ర‌బాబు శాడిజానికి పరాకాష్ట అని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు.  బీసీ మహిళ, జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. అయన స్పందిస్తూ... వైయ‌స్ఆర్‌సీపీ  నాయకుల మీద వరుసగా దాడులు చేయించడమే కాదు, చివరకు బీసీ మహిళా నాయకుల మీద కూడా నిస్సిగ్గుగా దాడులు చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో మీరు ఉన్నారు కదా అని, చేతిలో అధికారం ఉంది కదా అని, పోలీసులు ఎలా చెప్తే అలా వింటున్నారు కదా అని, మీ పచ్చసైకోలతో మీరు దాడులు చేయించడం ఏమంత గొప్పపనా? ఏం నేరం చేశారని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన స్థానిక జడ్పీ సభ్యురాలు, కృష్ణాజిల్లా ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో మీవాళ్లను పంపి దాడులు చేయించారు. పైగా పోలీసులు ఉన్నప్పుడే, వారి సమక్షంలోనే దుర్భాషలు ఆడుతూ ఈ దాడి చేయించారు. ఇలా చేయడం ఏమన్నా గొప్పపనా? దీన్ని పరిపాలన అనరు చంద్రబాబుగారూ, శాడిజం అంటారు, పైశాచికత్వం అంటారు. ఒక రాజకీయపార్టీగా మా కార్యక్రమాలు మేం చేసుకోకూడదా? ఆ కార్యక్రమాలకు మా నాయకులు, మా మహిళా నాయకులు హాజరు కాకూడదా? ఇదేమైనా తప్పా? మా వాళ్లని ఎందుకు హౌస్‌ అరెస్టు చేయాల్సి వచ్చింది? కార్యక్రమానికి వెళ్తున్న వారిపై దాడులు ఎందుకు చేయాల్సి వచ్చింది? అందులోనూ మహిళ అనికూడ చూడకుండా, దుర్భాషలు ఆడుతూ, సిగ్గు, ఎగ్గు వదిలేసి దాడి చేశారు అని తెలిపారు.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa