ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి బోర్డర్ దాటి ఉగ్రవాద శిబిరంపై భారత్ డ్రోన్ దాడులు

national |  Suryaa Desk  | Published : Sun, Jul 13, 2025, 08:49 PM

మాయన్మార్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ –ఇండిపెండెంట్ (ఉల్ఫా) తూర్పు ప్రధాన కార్యాలయంపై భారత సైన్యం దాడులు జరిపినట్టు వచ్చిన ఆరోపణలను ఆర్మీ ఖండించింది. తూర్పు మాయన్మార్ స్థావరంపై భారత సైన్యం డ్రోన్ దాడులు జరిపిందని ఉల్ఫా ప్రకటించింది. ఈ దాడుల్లో 19 మంది తమ సభ్యులు మృతి చెందారని, మరో 19 మందికి గాయాలయ్యాయని తెలిపింది. అయితే ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్.. తాము ఎటువంటి దాడులను చేయలేదని స్పష్టం చేసింది. ‘అటువంటి ఎలాంటి ఆపరేషన్‌పై భారత సైన్యానికి సమాచారం లేదు’ అని గౌహాతిలోని రక్షణ శాఖ ప్రజాసంబంధ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం పాకిస్థాన్ సరిహద్దు దాటి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా భారత సైన్యం మాయన్మార్ సరిహద్దులు దాటి చొచ్చుకొచ్చిందిన ఉల్ఫా ఆరోపించడం గమనార్హం.


ఈ దాడుల్లో ఉల్ఫా సీనియర్ కమాండర్ నయన్ మేధి మృతి చెందినట్లు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. అలాగే, విధంగా మణిపూర్‌కు చెందిన నిషేధిత సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాజకీయ విభాగం రెవల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ కు చెందిన కొంతమంది కూడా మృతి చెందినట్లు సమాచారం. ఉల్ఫా (I) నేత పారేశ్ బరూచ్.., చైనా-భారత్-మాయన్మార్ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో తలదాచుకున్నాడనే అనుమానాలు ఉన్నాయి. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తో బరూచ్‌కు సంబంధాలున్నట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఉల్ఫాకు చెందిన మరో సీనియర్ కమాండర్ రూపమ్ అసోమ్‌ను అసోం పోలీసులు ఈ ఏడాది మే నెలలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బరూచ్‌తో కేవలం అరుణోదయ్ దోహోటీయా మాత్రమే ఉన్నట్టు సమాచారం.


భద్రతదళాల సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. ఈ దాడులు ఉల్ఫా మధ్యే జరిగే అంతర్గత ఘర్షణలే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం మాయన్మార్‌లో సైనిక పాలన కొనసాగుతుండగా.. ఆ దేశంలో అనేక తిరుగుబాటు సమూహాలు దాడులకు పాల్పడుతున్నాయి. ఉల్ఫా (I) వంటి సంస్థలు భారత్-మాయన్మార్ సరిహద్దులో క్యాంపులు ఏర్పాటు చేసుకుని, అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని ఉద్రిక్తతలు భారత భద్రతా వ్యవస్థకు పెను సవాలుగా మారాయి. ఇటీవల మణిపూర్ రాష్ట్రంలోని చందేల్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మిలిటెంట్లు హతమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలు, అంతర్గత ద్రోహాలు, సరిహద్దు వ్యూహాత్మక అంశాల పట్ల భారత భద్రతా వ్యవస్థ అత్యంత అప్రమత్తంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో జాతుల మధ్య వైరంతో గత రెండేళ్లుగా హింసాాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa