రాష్ట్రంలో అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహ ప్రయోగాలకు అద్భుతమైన వాతావరణం ఉందని పరిశ్రమల శాఖ తెలిపింది. ప్రధాన రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు అందిస్తూ పాలసీని రూపొందిస్తున్న పరిశ్రమల శాఖ.. తాజాగా అంతరిక్ష రంగంలోనూ భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా విధాన పత్రాన్ని విడుదల చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.యువరాజ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ వాటా రెండు శాతమే. అయితే.. ఇస్రో, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎ్సఐఎల్), డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సహకారంతో చేపడుతున్న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎ్సఎల్వీ), స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎ్సఎల్వీ), నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ) వంటి ప్రయోగాలతో అంతర్జాతీయ వేదికపై ఇప్పుడిప్పుడే భారత్ పేరు మార్మోగుతోంది. ఈ క్రమంలో అంతరిక్ష పరిశోధనా రంగాల్లో ఏపీని ఉన్నత స్థానంలో నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం విద్యార్థులు, ఔత్సాహికుల సృజనాత్మకతను గుర్తించి వారికి అంతరిక్ష రంగంలో ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. అంతరిక్షం రంగంలో 2033 నాటికి రూ3.77 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించేలా కార్యాచరణకు సిద్ధమైంది. ముఖ్యంగా ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేలా పరిశ్రమల శాఖ నూతన విధానాన్ని రూపొందించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa