డైవర్షన్ పాలిటిక్స్కి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని తెరలేపారని తెలుగుదేశం పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా విమర్శించారు. ప్రశాంతమైన పామర్రులో పేర్ని నాని అల్లర్లు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సభ్యసమాజం తలదించుకునే విధంగా రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పేర్ని నాని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రౌడీలు, కిరాతకులు చేసే పనులకు.. పేర్ని నాని బ్యాచ్కు ఏం తేడా ఉందని ప్రశ్నించారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా.ఇవాళ (సోమవారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో వర్ల కుమార్ రాజా మీడియాతో మాట్లాడారు. రాత్రులు ఎవరూ దాడులు చేస్తారనే అశాంతితో పామర్రు రైతులు ఉన్నారని చెప్పుకొచ్చారు.పేర్ని నాని వ్యాఖ్యలపై, ఫోన్ సంభాషణపై జగన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఏపీలో అశాంతిని సృష్టించేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ అమలుతో జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైందని అన్నారు. వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందనే భయపడే పేర్ని నానితో డైవర్షన్ పాలిటిక్స్కు తెరదీశారని ఆక్షేపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa