ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యని హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్న భర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 12:21 PM

రాష్ట్రంలో కుటుంబ వివాదాలు, భార్యపై అనుమానంతో భర్త హత్య చేసిన ఘటన నెలకొంది. ఈ ఘటన తిరుపతి రూరల్‌లోని మంగళం రిక్షా కాలనీ పరిధిలో జరిగింది. భార్య, భర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే భార్య ఉషా(34)పై కోపంతో భర్త లోకేశ్వర్ హత్య చేశాడు. మృతురాలు అమర్‌ రాజా ఫ్యాక్టరీలో ఉద్యోగిని. ఉదయం 5 గంటలకు ఆమె డ్యూటీకి వెళ్తుండగా దారికాచి భర్త లోకేశ్వర్ హత్య చేశాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గత కొంతకాలంగా ఉష తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. లోకేశ్వర్ జులాయిగా తిరుగుతూ ఉండటంతో దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని ఏఎస్సీ రవి మనోహరాచారి, తిరుచానూరు పోలీస్ స్టేషన్ సీఐ సునీల్ కుమార్, మంగళం క్లస్టర్ ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి పరిశీలించారు. భార్య హత్య అనంతరం తిరుమల నగర్‌లో భర్త లోకేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. భార్త, భర్తలు మృతిచెందడంతో వీరి ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa